సూర్యాపేట డివిజన్ డిఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన ఎస్పీ నరసింహ ఐపీఎస్

Jun 9, 2026 - 21:59
Jun 9, 2026 - 22:03
 0  1
సూర్యాపేట డివిజన్ డిఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన ఎస్పీ నరసింహ ఐపీఎస్

సూర్యాపేట డివిజన్ డిఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన ఎస్పీ నరసింహ ఐపీఎస్

రికార్డులను పరిశీలించి విధుల నిర్వహణపై దిశానిర్దేశం.

బాధితులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశం

సూర్యాపేట టౌన్, 9 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- .సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శాంతినగర్ వద్ద గల సూర్యాపేట డివిజన్ డిఎస్పీ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఈరోజు (మంగళవారం) సందర్శించారు. సంబంధిత పోలీస్ అధికారులతో కలిసి  కార్యాలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం కార్యాలయంలో నిర్వహిస్తున్న వివిధ రకాల రికార్డులను నిశితంగా పరిశీలన చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, కేసుల దర్యాప్తు పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారికి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలి. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించే విధంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది విధులను నిరంతరం పర్యవేక్షించాల్సి డిఎస్పీకి తెలియజేశారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, రూరల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ మరియు కార్యాలయ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు భరోసా సెంటర్, షీ టీమ్స్ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ నరసంహ.

వేధింపులపై దైర్యంగా పిర్యాదు చేయాలి.… K.నరసింహ, ఎస్పీ సూర్యాపేట జిల్లా

వేదింపులకు, దాడులకు గురైన వారికి బరోసా, దైర్యం కల్పించాలని షీ టీమ్స్, భరోసా సెంటర్స్ సిబ్బందికి ఎస్పీ నరసింహ సూచించారు, మహిళా, పిల్లల రక్షన చట్టాలు, శిక్షల గురించి అవగాహన కల్పించాలని భరోసా సెంటర్, షీ టీమ్స్ సిబ్బందిని ఆదేశించినారు. జిల్లా కేంద్రం లో జాతీయ రహదారి వెంట గల మహిళా భరోసా సెంటర్, షీ టీమ్స్ కార్యాలయాలను జిల్లా ఎస్పీ గారు సందర్శించి కార్యలయం నంధు నిర్వహిస్తున్న రికార్డ్స్ ను పరిశీలించారు, సిబ్బంది నిర్వహిస్తున్న పనులులు, మహిళల, పిల్లల రక్షణ పట్ల తీసుకుంటున్న చర్యలు, కౌన్సిలింగ్ నిర్వహణ, అవగాహన కార్యక్రమాల నిర్వహణ ను పరిశీలించి సిబ్బందికి సలహాలు సూచనలు అందించారు. దాడులకు, వేదింపులకు గురౌతున్న బాలల పట్ల, మహిళల పట్ల మానవతా దృక్పదం తో పని చేయాలి, వారికి సామాజిక అభద్రతా భావం ఏర్పడకుండా దైర్యం కల్పించాలి, ఎప్పటికప్పుడు న్యాయ సహాయం అందించాలి, వైద్యం, మానసిక దైర్యం కల్పించాలి అని ఎస్పీ  అన్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల్లో, పట్టణాలు, కాలనీలలో భద్రత చట్టాల అమలు గురించి, పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి, రద్ధి ప్రాంతాల్లో ఆకతాయిలపై నిగా ఉంచాలి, విద్యాసంస్థల్లో కమిటీలు ఏర్పాటు చేయాలి ఎలాంటి సమస్య వచ్చిన, వేదింపులు జరిగిన సమాచారం వచ్చేలా నిఘా ఉంచాలి అని ఆదేశించారు.

వేదింపులు, అత్యాచారం, నిరాదరణకు గురైన బాధిత మహిళలకు, పిల్లలకు ఒకే చోట న్యాయపరమైన, వైద్యం పరమైన సదుపాయాలు, సామాజిక భద్రత, నైతిక భద్రత, మానసిక దైర్యం, అవసరమైన వారికి చదువు ఇలా అన్ని సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ, బాధితులకు మనొదైర్యం కల్పించే విధంగా రాష్ట్ర పోలీసు మహిళ అండ్ చెల్డ్ వెల్ఫేర్ అధ్వర్యంలో జిల్లా బరోసా సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగినదని అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట డీఎస్పీ ప్రసన్న కుమార్, సిఐ లు రాజశేఖర్, వెంకటయ్య, ఆర్ఎస్ఐ సురేష్, బారోసా సెంటర్ SI మౌనిక, షీ టీమ్స్ SI నీలిమ, ASI లు సైదాభి, బారోసా సెంటర్, షీ టీమ్స్ సిబ్బంది ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333