సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

Aug 1, 2024 - 20:15
 0  30
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ

ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో మహనీయులు అంబేద్కర్ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు .30 ఏళ్లుగా మాదిగ, మాదిగ ఉప కులాల ప్రజలు న్యాయమైన ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం జరిగిన పోరాటంలో అమరులైన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేని కొనియాడారు. సుప్రీంకోర్టు తీర్పు ను మాదిగ, మాదిగ ఉపకులాల విజయంగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుప్రీం తీర్పును అనుసరించి వర్గీకరణ ఫలాలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ సాక్షిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం నేతలు వల్దాస్ ప్రవీణ్, శ్రావణ్  వల్లపట్ల రవి, నాగరాజు, వెంకన్న , ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333