సాగునీటితో చెరువు నింపి నీటి సమస్యను తీర్చాలి.... సామాజిక కార్యకర్త గంధం సైదులు

Feb 23, 2024 - 20:05
 0  12
సాగునీటితో చెరువు నింపి నీటి సమస్యను తీర్చాలి.... సామాజిక కార్యకర్త గంధం సైదులు
సామాజిక కార్యకర్త గంధం సైదులు

మునగాల 23 ఫిబ్రవరి 2024

 తెలంగాణ వార్త ప్రతినిధి :-

సాగర్ నీటితో చెరువుల నుండి తాగునీటి సమస్యలు పరిష్కరించాలని సామాజిక కార్యకర్త గంధం సైదులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సంవత్సరం వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే బోర్లు బావులలో భూగర్భ జలాలు ఇంకిపోయి ఎండిపోతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి సాగర్ నీటిని విడుదల చేసి చెరువులు నింపాలన్నారు. మిషన్ భగీరథ నీళ్లు కూడా రాకపోవడంతో గ్రామాల్లో ఇప్పటికే నీళ్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి లు చొరవ తీసుకొని తక్షణమే నీటిని విడుదల చేయించాలని కోరుతున్నాను.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State