చెక్ డ్యాంలు పూర్తి చేయిస్తా

Feb 23, 2024 - 19:55
Feb 23, 2024 - 21:05
 0  179

అక్రమ ఇసుక రవాణా అడ్డుకుంటా ఎమ్మెల్యే మందుల సామేలు

అడ్డగూడూరు 23 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని ధర్మారం గ్రామంలో బిక్కేరు వాగులో చెక్ డ్యాం పూర్తి చేసి ఈవాగులో అక్రమ ఇసుక రవాణాను అరికడతానని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శుక్రవారం తన స్వగ్రామమైన ధర్మారం గ్రామంలో తను కౌలుచేస్తున్న పొలంను పరిశీలించి పొలం పక్కనే బిక్కేరు వాగులో చెక్ డాం పనులను పరిశీలించారు.వాగులో ఇసుక రవాణా కోసం వేసిన రోడ్డును చూసి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు గతబిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక రవాణాను చూసి కాంగ్రెస్ పార్టీకి ఈ తుంగతూర్తి నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించారు.ప్రజలకు రుణపడి ఉంటూ ఈ ప్రాంత వనరులను కాపాడుతామన్నారు.తదనంతరం గ్రామంలో అబివృద్ది పై పరిశీలించారు. గ్రామంలో సిసిరోడ్లు, మురుగు కాల్వలు ,పాఠశాల వసతులు, ఐకేపీ నిర్వహణకు స్థలం పరిశీలించారు.గ్రామస్తులను ఆప్యాయంగా పలుకరిస్తూ యోగక్షేమాలు అడిగితెలుసుకున్నారు. అధికారులతో సమీక్షించారు. ఈకార్యక్రమంలో రైతులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333