సంస్కృతి సారధి కళాకారుల ఆధ్వర్యంలో ప్రజాపాలకులకు పాలాభిషేకం

Aug 1, 2024 - 21:56
 0  207
సంస్కృతి సారధి కళాకారుల ఆధ్వర్యంలో ప్రజాపాలకులకు పాలాభిషేకం

తిరుమలగిరి 02 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కళాకారులకు గత ప్రభుత్వం 583 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి వారికి స్వరాష్ట్రంలో తగిన గౌరవం అందించింది గత పది సంవత్సరాల నుండి 24,514 రూపాయల గౌరవ వేతనం ఇచ్చి వారికి తగిన స్థానాన్ని ఇచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటే ఏమిటో నిరూపించుకుంది 583 మంది కళాకారులకు పిఆర్సి పెంచి 24,514 ఉన్న జీతాన్ని 31,868 రూపాయలకు పెంచి కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపింది. కళాకారులకు సముచిత స్థానాన్ని ఇచ్చి వారిని జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ముఖ్యమంత్రి  .ఎనుముల రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క , సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు .జూపల్లి కృష్ణారావు , సూర్యాపేట జిల్లా స్థానిక మంత్రులు .ఉత్తంకుమార్ రెడ్డి   .కోమటిరెడ్డి వెంకటరెడ్డి , భాష సంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ , విజయ్ కుమార్   తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు సూర్యాపేట జిల్లా టీం లీడర్ పాక ఉపేందర్ ఆధ్వర్యంలో పాలభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో సంస్కృతిక సారథి కళాకారులు పాల్గొన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034