శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయానికి ఫ్రిడ్జ్ వితరణ
జోగులాంబ గద్వాల 5 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి శేషంపల్లి గ్రామానికి చెందిన నాయికి సరస్వతి తిమ్మారెడ్డి దంపతులు ఫ్రిడ్జ్ ని బహుకరించారు. శుక్రవారం దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు ఈవో సత్యచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఫ్రిడ్జ్ ని అందజేశారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించిన అనంతరం వారికి స్వామి వారి శేష వస్త్రం తీర్థప్రసాదాలు ఫోటోను అందజేశారు.