విద్యార్థులకు చట్టాలు వాటి బాధ్యతలపై అవగాహన సదస్సు
తిరుమలగిరి 22 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల యందు బాల రక్ష భవన్ నుండి జిల్లా బాలల పరిరక్షణ విభాగం మరియు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో .. పిల్లల చట్టాలు మరియు వారి సమస్యలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్. కందుకూరి మంగ పోషణమాసత్సవా సందర్బంగా మాట్లాడుతూ పిల్లలు మంచి ఆహారం తీసుకోవాలని పరిశుభ్రత పాటించాలి అని తెలిపారు మరియు పిల్లల చేత ప్రతిజ్ఞ చేపించడం జరిగింది. జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుండి కౌన్సిలర్. శోభారాణి మాట్లాడుతూ"విద్యార్ధిలకు బాలల చట్టాలు మరియు బాధ్యతలు తెలుసుకోవాలి అని అన్నారు సమాజంలో ప్రతి ఒక్కరి విద్యార్థి ఆలోచన విధానం మార్పు రావాలని ప్రతిఒక్కరు భవిష్యత్తుపై లక్ష్యంతో చదువుకోవాలని ప్రతి విద్యార్థికి లక్ష్యం ఉండాలని ప్రతి ఒక్కరు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండే విధంగా భవిష్యత్తు కార్యచరణ చేసుకోవాలని చెప్పినారు.సేఫ్ టచ్ మరియు అన్సేఫ్ టచ్ మరియు డిసిపియు ఆక్టివిటీస్ గురుంచి అవగాహన కల్పించారు.పాఠశాల దశలో విద్యార్థి పూర్తిస్థాయి అన్ని అంశాలపై అవగాహన చేసుకోవాలని భవిష్యత్తు , తల్లిదండ్రుల , సమాజం మరియు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు గురించి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. స్పెషల్ ఆఫీసర్ సుష్మిత మాట్లాడుతూ ఈ పాఠశాల దశలో పిల్లలు తీసుకున్న నిర్ణయాలు మీ జీవితంలో పునాదుల్లా ఉంటాయని తెలిపినారు. మరియు ఆడపిల్లలు చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అని తెలిపారు . కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు , కవిత,వాణిశ్రీ, కళావతి, ఇందిరా,యశోద ,శిరీష ,సంతోష, అంగన్వాడీ టీచర్. కవిత పిల్లలు పాల్గొనడం జరిగింది.