మూసి వాగు పునరుద్ధరణ చేస్తాం!ఎమ్మెల్యే మందుల సామేల్

Oct 26, 2024 - 08:19
Oct 26, 2024 - 08:24
 0  52

అడ్డగుడూరు 25 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-

తెలంగాణ రాష్ట్రంలో ఎనలేని అభివృద్ధి కొరకై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ అడ్డగూడూరు మండల పరిధిలోని మూసి వాగు పునరుద్ధరణ సమావేశం నిర్వహించారు.ఎమ్మెల్యే మందుల సామేల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మూసి అనే వాగు అనంతగిరి పద్మనాభ గిరి కొండల్లో వికారాబాద్ జిల్లా అక్కడ పుట్టింది. హిమాయత్ నగర్ నుండి గండిపేట నుండి హైదరాబాద్ నడిబొడ్డు నుంచి వచ్చి తుంగతుర్తి నియోజకవర్గం ఇటుకలపాడు అక్కడినుండి మూసి రిజర్వాయర్ నుండి కృష్ణ నదిలోకి వెళ్తాయి.. ఇక్కడ మూసి నది పుట్టిన నాడు మూసీ నదిని చూసి ఆనాడు హైదరాబాదును పట్నంగా చేశారు. ఎక్కడనైనా నదిలు ఉంటే మహానదులు అక్కడ ఉంటాయి.. ఆనాడు అందరూ మూసి నదినీరు తాగేవారు. ఈ రోజుల్లో అపవిత్రమైన నీరు ఈ రోజున మొత్తం కలుషితం అయ్యాయి ఇప్పుడు మనుషులు ఎవరు తాగడం లేదు.. పశువులు తాగడం లేదు.. మనం పండించే పంట మనం తినే పరిస్థితిలో లేము మనం పండించిన పంట వేరే దగ్గర అమ్మి అక్కడి నుండి మనం తెప్పించుకుంటున్నాం గత ప్రభుత్వం 25 వేలకోట్లు కేటాయించినo అన్నారు. దానికోసం మూసి రిజర్వాయర్ కార్పొరేషన్ మనీ సంస్థను ఏర్పాటు చేసి దానికి సుధీర్ రెడ్డిని చైర్మన్ గా ప్రకటించారు. దానికోసం కేటాయించిన 25 వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముసీ నదిని పునరుద్ధరణ చేస్తానని సీఎం అనగానే టిఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటున్నారు. దానిని ఎవరు అడ్డుకున్న మూసినది ప్రక్షాళన చేయడం ఖాయం పునరుభవం అంటే ఆనాడు మీరు ఎలా త్రాగే విధంగా ఉన్నాయో ఇప్పుడు కూడా అలా ఉండాలి దానికోసమే ముసి నది ప్రక్షాళన చేయాలన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో కమిషన్ల పేరుకు మొత్తం 25 కోట్లు ఎటుపోయాయి.. దానికి సమాధానం కేటీఆర్,హరీష్ రావు చెప్పాలన్నారు.10 సంవత్సరాలలో భూములను ఇసుకను మొత్తం దోసుకున్నారన్నారు.మూసి వాగుకు ఐదు చెక్ డ్యామ్ లు ప్రొఫెసర్ లో ఉన్నాయని అన్నారు అమ్మనబోల్ నుండి చిత్తలూరు వరకు శాంక్షన్ అయినా వెంబడి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. నేను రైతు బిడ్డనే కాబట్టి నాకు రైతు కష్టాలు ఏంటో తెలుసు కాబట్టి రైతులను కాపాడే బాధ్యత నేను తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోలబోయిన లింగయ్య యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి,టి పిసిసిరాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గుడేపు పాండు, బాలెoల విద్యాసాగర్,సురేష్, సైదులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామశాఖల అధ్యక్షులు, వెల్దేవి గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీగా అధ్యక్షుడు మంటి పెళ్లి గంగయ్య యాదవ్,బోడ యాదగిరి,మహేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.