మార్చ్ 5 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు

Mar 3, 2025 - 20:46
Mar 4, 2025 - 00:50
 0  7
మార్చ్ 5 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు

సూర్యాపేట, 3 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లాలో మార్చి 5 నుండి మార్చి 25 వరకు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఇంటర్ మిడియేట్ వార్షిక పరీక్షలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటనలో తెలిపారు.సూర్యాపేటలో 13 పరీక్ష కేంద్రాలు, కోదాడలో 8, నడిగూడెం లో 2,హుజూర్నగర్ లో 2,మఠంపల్లి లో 1,నేరేడుచర్ల లో 1,తిరుమలగిరి లో 2,తుంగతుర్తి లో 2,ఆత్మకూరు (ఎస్ )మండలంలో 1 పరీక్ష కేంద్రం జిల్లాలో మొత్తం 32 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు.విద్యార్థులు పరీక్ష కేంద్రాన్ని ఒక్క రోజు ముందుగానే చూసుకోవాలని అలాగే ప్రతిరోజూ పరీక్ష కేంద్రానికి ఒక్క గంట ముందుగానే చేరుకోవాలని ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సూచించారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333