పొదిల పార్వతి దశదిన కర్మ కార్యక్రమం లో పాల్గొన్న తుంబూరు దయాకర్ రెడ్డి , మేకల మల్లిబాబు యాదవ్
ఖమ్మం 3 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి: యాదవ సంఘం నాయకులు పొదిల చిన్న పాపారావు సతీమణి పొదిల పార్వతి ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఈరోజు జరిగిన వారి దర్శన కర్మ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ ఇంచార్జి తుంబూరు దయాకర్ రెడ్డి , జిల్లాఅఖిలభారత యాదవ మహాసభ గౌరవ అధ్యక్షులు మేకల మల్లి బాబు యాదవ్ , జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య , జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ లు పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు . వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని తోడుగా నీడగా ఇన్నాళ్లు తనతో జీవితాన్ని పంచుకొని చివరి దశలో సతీమణిని కోల్పోవడం దురదృష్టకరమని , విచారం వ్యక్తం చేశారు పాపారావును , కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు . ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు కార్యకర్తలు కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల గురించి ప్రస్తావించగా అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా కొత్త రేషన్ కార్డులు ఇండ్లు , కొత్త పింఛన్లు మంజూరు అవుతాయని దయాకర్ రెడ్డి తెలిపారు . ఈ కార్యక్రమంలో ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ యరగొర్ల హనుమంతరావు , చేతుల నాగేశ్వరరావు , మొరిమేకల కోటయ్య , గోసు మధు , తోడేటి లింగ రాజు , పొదిల సతీష్ , పొదిల తిరపయ్య , పొదిల భూపతి , పల్లపాటి పుల్లారావు , పొదిల బిక్షం , పొదిల పాపారావు , మేకల మల్లికార్జునరావు , శీలం పుల్లయ్య , మేకపోతుల మహేష్ , పొదిల రాజు , నవ్య , పొదిల రాము , చిలకల లత శ్రీ , నాగరాజు, మీగడ అంజయ్య , గడ్డం రామయ్య మరియు తదితర బంధు మిత్రులు పాల్గొన్నారు .