బి ఎల్ వో లను సన్మానించిన
ఇటిక్యాల్ తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి.
జోగులాంబ గద్వాల 15 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల . మండల కేంద్రం లో తహసిల్దార్ కార్యాలయం నందు మండలంలోని వివిధ గ్రామాల బిఎల్ఓ లను శాలువాతో సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్లు & వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు లకు ముందుగా 80 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వారి విధులు నిర్వర్తిస్తూనే ఎస్ఐఆ ర్ ప్రోగ్రాం సకాలంలో100% పూర్తి చేసినందుకు గాను శాలువలతో బిఎల్వోలను చిరు సత్కారం చేసి అభినందనలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కార్యాలయం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు & అంగన్వాడీ టీచర్లు తదితరులు ఉన్నారు.