ప్రముఖ స్వాతంత్ర సేనానిఆల్లూరి సీతారామరాజు కి
ఘన నివాళులు సమర్పించిన గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం
తెలంగాణ వార్త జూలై 4 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం : భారతీయుల స్వాతంత్ర్యం కోసం మన్యం ప్రజల రక్షణ కోసం బ్రిటిష్ వారితో పోరాడిన మన్యం వీరుడు స్వర్గీయ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు సమర్పిస్తున్నట్లు గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామా వజ్జల.రవికుమార్ తెలియజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం తన సర్వస్వం త్యాగం చేసి ఆదివాసి గిరిజనులతో కలసి భారతీయుల కోసం స్వాతంత్ర్య పోరాటం జరిపిన అల్లూరి సీతారామరాజు సేవలను నేటి యువ తరానికి ఆదర్శం కావాలని దేశ అభివృద్ధిలో యువత ప్రధాన భూమిక పోషించాలని అదే మనం అల్లూరికి ఇచ్చే ఘనమైన నివాళి అవుతుందని రామా వజ్జల తెలిపారు.