ప్రభుత్వ కార్యాలయాలకు స్థల పరిశీలన కలెక్టర్
తెలంగాణ వార్తమాడుగులపల్లి మార్చి 1
మాడుగులపల్లి మండల కేంద్రంలో నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం స్థానిక మండల కేంద్రంలోని ప్రభుత్వ స్థలంలో తహసిల్దార్ కార్యాలయం ఎంపీడీవో కార్యాలయం పోలీస్ స్టేషన్ ప్రభుత్వ కార్యాలయాలకు స్థల పరిశీలన చేసినారు. నిర్మాణంలో ఉన్న మండల కేంద్ర గ్రామపంచాయతీ భవనమును పరిశీలించి గ్రామపంచాయతీ భవనం తొందరగా పూర్తయ్యే విధంగా చొరవ తీసుకోవాలని స్థానిక అదికారులకు తెలిపారు. వారి వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఎమ్మార్వో సురేష్ కుమార్, ఎంపీడీవో తిరుమల స్వామి, అరై రేణుక, పి ఆర్ ఏ ఈ మధు, కార్యదర్శి కాసిం, జానయ్య,తాజా మాజీ జెడ్పిటిసి పుల్లెంల సైదులు, గడ్డం పురుషోత్తం రెడ్డి, ఎరుకల వెంకన్న, ఆరూరి నరేష్, సంబంధిత ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.