ప్రజావాణి కి 35 ఫిర్యాదులు

Aug 12, 2024 - 19:01
 0  1
ప్రజావాణి కి 35 ఫిర్యాదులు

జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్

గద్వాల కలెక్టరేట్ : ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు ఆదేశించారు.సోమవారం ఐడిఓసి సమావేశం హాలులో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని వివిధ సమస్యలపై వచ్చిన ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు చేసుకున్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో వారికి తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం మొత్తం 35 ఫిర్యాదులు అందాయని, వచ్చిన దరకాస్తులను పెండింగ్ ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, స్పెషల్ డిప్యూటి కలెక్టర్ శ్రీనివాస రావు, ఆర్డీఓ రాంచందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333