పోషణ పక్షంలో గర్భిణీలకు అవగాహన

తిరుమలగిరి 18 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
తిరుమలగిరి మండలంలోని నెల్లిబండ తండా అంగన్వాడి సెంటర్లో పోషణ పక్షంలో భాగంగా సూపర్వైజర్ కందుకూరి మంగమ్మ మాట్లాడుతూ వెయ్యి రోజుల ప్రాముఖ్యత గురించి గర్భవతులు బాలింతలకు వివరించారు. పిల్లలకి హైపటైటిస్ టెస్ట్ చేసి తల్లులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూలు టీచర్లు అనిత కుమారి, శ్రీనివాస్ అంగన్వాడీ టీచరు పద్మ అంగన్వాడి హెల్పర్ హంస గర్భవతులు ,బాలింతలు, పిల్లల తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.