పుర వీధుల్లో ఘనంగా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం.

Oct 13, 2024 - 19:18
Oct 13, 2024 - 20:36
 0  1
పుర వీధుల్లో ఘనంగా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం.

దేవి విగ్రహాల నిమజ్జనం 

తెలంగాణ వార్త 13.10.2024.సూర్యాపేట జిల్లా ప్రతినిధి  జిల్లా కేంద్రంలో ఆదివారం 21వార్డు బీర వోలుయువ సేన ఆధ్వర్యంలో,35వ వార్డు లో రంగినేని లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో,36వ వార్డు శ్రీనివాస్ కాలనీలో కల్లూరి మురళీకృష్ణ, గాలి సందీప్ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ అమ్మవారిని పూరవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. దేవి నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా సూర్యాపేటలో పలుచోట్ల అమ్మవారి ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పు చప్పులతో, మేల తాళాలతో, మహిళల కోలాట చప్పులతో అమ్మవారి ఊరేగింపును నిర్వహించారు. అనంతరం సూర్యపేట మినీ ట్యాంక్ బండ్ లో కనకదుర్గమ్మ అమ్మవారిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో చెర్కు వేణు, రమేష్ నాయుడు, పరమేష్, ఉదయ్, రాజు, రామకృష్ణ, వెంకన్న,రవి,పవన్ కుమార్, చల్ల మహేష్, కిరణ్ కుమార్, సతీష్, విక్కీ, శరత్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223