నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు రాస్తారోకో

Mar 15, 2024 - 21:19
 0  3
నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు రాస్తారోకో

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు రాస్తారోకో* ఆత్మకూర్ ఎస్... పంట చేతికొచ్చే సమయానికి నీళ్ళు అందడం లేదంటూ వెంటనే నెల్లివ్వాలని పెన్ పహాడ్ మండలం దర్మాపురం, భక్తలాపురం, రంగయ్యగూడెం, తుల్జారావు పేట, గ్రామాలరైతులు ఆత్మకూర్ ఎస్ మండలం కొటినాయక్ తండా srsp మెయిన్ కెనాల్ బ్రిడ్జి పై రాస్తారోకో నిర్వహించారు.చివెంల మండలం పెన్ పహాడ్ మండలాల కు నీళ్లు ఇవ్వడం లో అధికారులు రైతుల కు సరైన న్యాయం చేయడం లేదని ఆరోపించారు. వెంటనే అధికారులు పంటలు ఎండిపోకుండా నీళ్ళు అదెలా చూడాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడడం తో సమాచారం తెలుసుకున్న ఆత్మకూర్ ఎస్ ఐ సైదులు సిబ్బంది తో వచ్చి రైతుల కు సర్ది చెప్పి విరమింప జేశారు. ఈ ధర్నా లో రైతులు తోగరు లింగయ్య, సాదే సీతయ్య, కర్ణకర్, శంకర్, భాస్కరా చారి, వెంకటేశ్వర్లు, అజయ్ శ్రీను సుమారు 50మంది రైతులు పాల్గొన్నారు.