నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూములను ఇతర అవసరాలకు మళ్లించకూడదు
కేంద్రీయ నవోదయ విశ్వవిద్యాలయానికి వెంటనే భూములను కేటాయించాలి
హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి
మూత పడిన చెక్కర ఫ్యాక్టరీలను వెంటనే పునరుద్ధరించాలి
బి.సి కులస్తుల రిజర్వేషన్లో అన్యమతస్తులను చేర్చకూడదు
రాష్ట్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు నశించాలి
జగిత్యాల 6 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- కాంగ్రెస్ ప్రభుత్వ రైతు మరియు విద్యార్థి వ్యతిరేక విధానానికి నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక తాసిల్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నలువల తిరుపతి, పార్లమెంట్ కో కన్వీనర్ గుంటుక సదాశివం, జిల్లా కార్యాలయ కార్యదర్శి జుంబర్తి దివాకర్, జగిత్యాల్ పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, BJYM రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్,పిల్లి శ్రీనివాస్, జగిత్యాల్ నియోజకవర్గం మరియు ధర్మపురి నియోజకవర్గ మండల అధ్యక్షులు మరియు జిల్లా మండల పదాధికారులు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.