స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతి నిధ్యం కోసం చట్ట సాధనకై దశల వారీగా ఉద్యమం 

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేయాలి

Mar 6, 2025 - 21:58
Mar 6, 2025 - 22:00
 0  23
స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతి నిధ్యం కోసం చట్ట సాధనకై దశల వారీగా ఉద్యమం 
స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతి నిధ్యం కోసం చట్ట సాధనకై దశల వారీగా ఉద్యమం 

ఎన్ పి ఆర్ డి  జిల్లా ప్రధాన కార్యదర్శి  వనం ఉపేందర్

రామన్నపేట 06 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-  తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీ,మున్సిపాలిటీ, మండల పరిషత్,జిల్లా పరిషత్లలో ఇద్దరు వికలాంగులను నామినేట్ చేయడానికి వీలుగా ప్రత్యేక చట్టం చేయాలని ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ డిమాండ్ చేశారు.గురువారం రోజు రామన్నపేట టౌన్  రామన్నపేట మండలం నిదాన పెళ్లి,బోగారం,వెల్లంకి,అంబాయి గూడెం,గ్రామాలలో స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 1 నుండి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న లక్ష సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా రామన్నపేట టౌన్ రామన్నపేట మండలం నిదాన పెళ్లి,భోగారం,గ్రామాలలో  సంతకాల సేకరణ కార్యక్రమన్ని చేపట్టారు.అయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ డిసెబుల్డ్ స్టడీస్ రిపోర్ట్ ప్రకారం 43.02 లక్షల మంది (రాష్ట్ర జనాభాలో 12.02 శాతం) వికలాంగులున్నారు.రాష్ట్రంలో 2024 డిసెంబర్ నాటికి 12769  గ్రామ పంచాయతీలు,130 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్స్,540 మండల పరిషత్లు,32 జిల్లా పరిషత్లు ఉన్నవి.ఇప్పటికే రాజస్థాన్, చత్తీస్గడ్  రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల్లో ఇద్దరు వికలాంగులను నామినేట్ చేయడానికి ప్రత్యేక చట్టాలు చేసి అమలు చేస్తున్నారు.అఖిల భారత కాంగ్రెస్ కమిటీ హామీ ఇచ్చిన ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున పంచాయతీ రాజ్ చట్టానికి మరియు మున్సిపల్ చట్టానికి సవరణలు చేసి,ఇద్దరు వికలాంగులను నామినేట్ చేసేందుకు వీలుగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018,తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లలో సవరణలు చేసి, ప్రత్యేక చట్టం చేసి వికలాంగులకు అవకాశాలు కల్పించాలని కోరుతున్నాము. స్థానిక సంస్థల్లో ఇద్దరు వికలాంగులను నామినేట్ చేస్తే గ్రామ పంచాయతీలలో 25,538 మందికి, మున్సిపాలిటీలలో 260 మందికి, మున్సిపల్ కార్పొరేషన్లలో 26 మందికి,మండల ప్రజా పరిషత్ లలో 1080 మందికి, జిల్లా పరిషత్లలో 64 మందికి రాజకీయ అవకాశాలు వస్తాయి.రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా 26,968 మందిని నామినేటెడ్ చేయడానికి అవకాశం ఉంది.కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల్లో వికలాంగులకు(నామినేట్ ) ప్రతినిత్యం కల్పిస్తూ అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేసి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి రామన్నపేట మండల కార్యదర్శి గిరికల లింగస్వామి రామన్నపేట టౌన్ అధ్యక్షులు పల్చం పరశురాం కార్యదర్శి ఎండి బాకర్ ఉపాధ్యక్షులు జినకల  లావణ్య సహాయ కార్యదర్శి మోటే రాజు కోశాధికారి వనం విజయలక్ష్మి ఉన్న అమరావతి నెల్లుట్ల సాయికుమార్ నిదాన పెళ్లి గ్రామ అధ్యక్షులు బుల్లి పెళ్లి అంజయ్య కార్యదర్శి భాష పెళ్లి యాదయ్య కోశాధికారి బాసిపెల్లి ప్రభుదాస్ ఉపాధ్యక్షురాలు కొండ జయమ్మ తిరుమల శ్రీను బోగారం గ్రామ గౌరవ అధ్యక్షులు గంటల రాంరెడ్డి కార్యదర్శి వనం ఆంజనేయులు గండూరి యాదగిరి గంట్ల రాములు చింతపల్లి రాధాబాయి గొర్రె జంగమ్మ గుజ్జ అంజమ్మ వెల్లంకి గ్రామ నాయకులు మంగ శ్రీను కంబాలపెళ్లి స్వర్ణలత తాటిపాముల జంగయ్య అంబాయి గూడెం గ్రామ నాయకులు గంగాదేవి కొండల్ గంగాదేవి శంకరయ్య అంజయ్య తదితరులు పాల్గొన్నారు.