జోగులాంబ అమ్మవారి టెంపుల్ని మరియు రికార్డులను ఆకస్మిక తనిఖీ  అడిషనల్ దేవాదాయ శాఖ కమిషనర్

Mar 12, 2025 - 19:11
 0  47
జోగులాంబ అమ్మవారి టెంపుల్ని మరియు రికార్డులను ఆకస్మిక తనిఖీ  అడిషనల్ దేవాదాయ శాఖ కమిషనర్

జోగులాంబ గద్వాల 12 మార్చ్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: అలంపూర్. జోగులాంబ అమ్మవారి ఆలయంలో గత కొద్ది రోజులుగా ఆలయము పై వస్తున్న పలు ఆరోపణల అంశమై ఈ రోజు తేదీ: 12.03.2025 బుధ వారము నాడు దేవాదాయ శాఖ అధనపు కమీషనర్, శ్రీ శ్రీనివాసరావు  ఆలయమునకు విచ్చేసి ఆలయ భూముల వివరాలు, పలు రకాల టెండర్ల వివరాలు, రోజువారీ డి.సి.ఆర్. వివరాలు,  క్యాష్ బుక్, ప్రసాదముల సత్రం, అన్నదాన సత్రం స్టాక్ బుక్ లను, అన్నదాన విరాళములు మరియు విరాళముల రశీదు బుక్కులను, పరిశీలించారు,  అలాగే అన్నదాన సత్రం నందు అన్న ప్రసాద వితరణ,  ప్రసాదముల తయారీ సత్రం నందు ప్రసాదముల నాణ్యత, పరిమాణములను,  కౌంటర్లను పరిశీలన చేశారు.  అనంతరం ఇట్టి నివేదికను దేవాదాయ శాఖ కమీషనర్ కి అందజేస్తామని దేవాదాయ సిబ్బందికి తెలియజేశారని టెంపుల్ సిబ్బంది తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333