గద్వాల ఆర్టీసీ డిపో మేనేజర్ మంజుల బదిలీ
షాక్ లో ప్రయాణికులు .
జోగులాంబ గద్వాల 22 జూలై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల:- జిల్లా ఆర్టీసీ డీఎం మంజుల బదిలీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం పలు డీపో మేనేజర్లను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా గద్వాల్ ఆర్టీసీ డిపో మేనేజర్ మంజులకు స్థాన చలనం కల్పించారు. దాదాపు ఒక సంవత్సరం నుంచి గద్వాల్ ఆర్టీసీ డిపో మేనేజర్ గా R మంజుల విధులు నిర్వర్తిస్తున్నారు. డిపో అభివృద్ధికి ఆమె ఎంతో కృషి చేశారు.ఆర్టీసీ డిపోలో సంస్థకు, ప్రయాణికులకు అందించిన సేవలకు రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకున్నారు.డిపో మేనేజర్ బదిలీ అవ్వడంతో షాక్ లో ప్రయాణికులు.ఆర్టీసీ అభివృద్ధికి తన వంతు కృషి ఎంతో చేసిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మధ్యమాల్లో ఆర్టీసీకి సంబంధించి ఎలాంటి సమాచారం అందిన డిపో మేనేజర్ గా తన వంతు కృషిగా సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించెది.ఆర్టీసీ అభివృద్ధికి తనవంతు కృషిగా ఎంతోచేసి నేడు బదిలీ అవ్వడం చాలా బాధలో ఉన్నట్లు ప్రయాణికుల నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న మేనేజర్ల లో ముఖ్యంగా Rమంజుల పేరు ప్రతి ఒక్కరు మదిలో ఉండిపోతుంది.మంజుల హైదరాబాద్ లోని బర్కత్ పుర ఆర్టీసీ డిపో కు బదిలీ అయ్యారు.. మరోవైపు గద్వాల నుంచి బదిలీ అవుతున్న మంజుల స్థానంలో కొత్త డిఎంగా మురళికృష్ణ నియామకం అయ్యారు.వేములవాడ డిపో నుంచి ఆయనను గద్వాల కు బదిలీ చేశారు.