కార్మిక నాయకుడు బాలాగోపాల్ రెడ్డికి ఘన నివాళులు అర్పించిన.
AITUC జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు& కార్మికులు
జోగులాంబ గద్వాల 6 మార్చి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. బాలాగోపాల్ రెడ్డి ప్రథమ వర్ధంతిలో ఆయన ఆశయ స్ఫూర్తి తో ప్రతి కార్మికుడు ఉద్యమించాలని పిలుపు బుధవారం నాడు గద్వాల కార్మిక నేత బాలాగోపాల్ రెడ్డి ప్రథమ వర్ధంతిని నల్లకుంట కార్మిక సంఘం షెడ్డు లో ఆయన ఫొటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ యెక్క కార్యక్రమం లో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు పాల్గొని ఆయన పోరాట పటిమ తెగింపు కార్మికుల కోసం పరితపించిన విధానాలను కొనియాడారు. ప్రతి కార్మికుడు బాలాగోపాల్ రెడ్డి ని స్ఫూర్తి గా తీసుకోవాలని ఆంజనేయులు సూచించారు. నడిగడ్డలో ఎవరు చేయని విధంగా కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి అన్నరు.
ఈ కార్యక్రమంలో లారీ హమాలీ కార్మిక సంఘం నాయకులు నాగరాజు, నారాయణ, వెంకట్రాములు, BSP పార్టీ ముని, ఏఐటీయూసీ కార్మికులు అత్యరాజు, బిచుపల్లి, నరసింహులు, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.