కళాకారులచే ఆటపాటల ద్వారా డ్రగ్స్ అవగాహన సదస్సు
7 యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ,డి పి ఆర్ ఓ ఆదేశాల మేరకు బుధవారం రోజు అడ్డ గూడూరు మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట కళా జాతర సంస్కృతి వారిచే కళా ప్రదర్శన నిర్వహించడం జరిగింది.గంజాయి,డ్రస్సు ,నియంత్ర రోడ్డు భద్రత, వడదెబ్బకు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పరిసరాల పరిశుభ్రతపై కళా జాతర నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్ఐ వెంకట్ రెడ్డి,తాసిల్దార్ శేషగిరిరావు,గ్రామ సర్పంచ్ పూజారి వనిజా సైదులు,గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి వారి ఆధ్వర్యంలో ఆటపాట ద్వారా కార్యక్రమంలో తాటిపాముల శంకర్,ఎర్ర చరణ్ రాజ్, బోయపల్లి రంగయ్య, బోనాల నరేందర్ మందుల కృష్ణ, ఉప్పుల శంకరయ్య, యాట సంధ్య, సూడి లావణ్య, పాశం రాములు, మైపోల సురేష్, భూపతి సిద్దులు, గొల్లపల్లి కిట్టు, గుండెల లింగస్వామి సాంస్కృతి కార్యక్రమం ఆటపాట ద్వారా ప్రజలకు వివరించారు.