ఉపాధిహామీ కూలీలకు వసతులు కల్పించాలి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

మద్దిరాల 5 మార్చి2025 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో పలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మద్దిరాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు రాస్తుండగా విద్యార్థుల పరీక్ష పత్రాలను పరిశీలించి అనంతరం ప్రధానోపాధ్యాయులు మేడిపల్లి శ్రీనివాస్ ను పాఠశాలలో ఉపాధ్యాయులు అందరూ హాజరయ్యారని అడిగి రికార్డులను పరిశీలించారు.అనంతరం ఎంఈఓ కాట్ల రవికుమార్ తో మాట్లాడుతూ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా చేయడానికి సరియైన తరగతి గదులు,వసతులు ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులు జరుగుతుండగా ఉపాధి కూలీలతో మాట్లాడి ఉపాధి హామీ పనుల గురించి తెలుసుకొని ఉపాధి కూలీలకు మౌలిక వసతులు కల్పించాలని ఉపాధిహామీ అధికారులకు సూచించారు.అనంతరం మండల కేంద్రంలో రైతు మిత్ర ఆగ్రోస్ ను యూరియా బస్తా ఎంతకు అమ్మారని రైతు ఎంకన్నను అడిగి తెలుసుకుని,రూ.300 రూపాయలకు యూరియా బస్తా అమ్ముతుండగా బిల్లు పట్టి తో సహా చూసి స్టాకును పరిశీలించి స్టాక్ లో తేడా ఉండడంతో రైతు మిత్ర ఆగ్రోస్ ఎరువుల మందుల షాపు సీజ్ చేయాలని మండల వ్యవసాయ అధికారి అనీషా రూహికి సూచించారు.అదేవిధంగా మండల కేంద్రంలో నిర్మిస్తున్న మోడల్ హౌస్ ను మోడల్ త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు.అనంతరం మండల పరిధిలోని కుక్కడంలో పౌల్ట్రీ ఫామ్, పశువుల పాక నిర్మాణాలను పరిశీలించారు.
ముకుందాపురంలో హర్టికల్చర్ ద్వారా 8 ఎకరాల మామిడి తోటను పరిశీలించి హార్టికల్చర్ను రైతులు ప్రోత్సహించే విధంగా రైతులను సబ్సిడీతో వస్తున్న డ్రిప్పును అందించాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎవరైనా రైతులు పశువుల పాకలు,మామిడి తోటలు, నిమ్మ తోటలు,పామ్ ఆయిల్ తోటలు వేసుకునే వారు ఉంటే వెంటనే మంజూరు చేయాలని ఆర్టికల్చర్ ను ప్రోత్సహించాలని తోటలలో అంతర్ పంటలు కూడా వేసుకోవచ్చు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ బి నాగయ్య,ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి,తాసిల్దార్ అమీన్ సింగ్,ఎంఈవో కాట్ల రవి కుమార్,ఏపీవో వెంకన్న చారి, అశోక్ ,తదితరులు పాల్గొన్నారు.