ఉగాది పంచాంగం బుక్

కోరుట్ల, 30 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- ఉగాది పంచాంగం బుక్ ను డాక్టర్ వై అనుప్ రావు, కేమోక్స్ ప్రెసిడెంట్ స్వితి అనూప్ రావు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టైగర్ అలీ నవాబ్ వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
కోరుట్ల పట్టణంలో టీవీ5 హిందూ ధర్మం ఛానల్ ఆధ్వర్యంలో ఉగాది పంచాంగం బుక్ ను కోరుట్ల డాక్టర్ల బృందం. ఐఎంఏ రాష్ట్ర మెంబర్ డాక్టర్ వై అనుప్ రావు, కేమోక్స్ ప్రెసిడెంట్ స్వితి అనూప్ రావు ఆవిష్కరించడం జరిగింది అనంతరం ఐఎంఏ కోరుట్ల అధ్యక్షుడు డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ టీవీ5 హిందూ ధర్మం ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
టీవీ5 హిందూ ధర్మం ఆధ్వర్యంలో పంచాంగం బుక్ విడుదల చేస్తూ ప్రజలకు పంచాంగంపై అవగాహన కలిగేటట్లు చేస్తున్నందున టీవీ5 యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవ తెలంగాణ ఆర్సి రిపోర్టర్ పెడిమల్ల రాజు టీవీ5 మెట్పల్లి రిపోర్టర్ ఇలియాస్ కోరుట్ల టీవీ ఫైవ్ రిపోర్టర్ చిలువేరి లక్ష్మీరాజ్యం తదితరులు పాల్గొన్నారు.