ఆత్మహత్య చేసుకున్న వడ్డీ వ్యాపారి

Jun 6, 2024 - 21:40
 0  16
ఆత్మహత్య చేసుకున్న వడ్డీ వ్యాపారి

తిరుమలగిరి 07 జూన్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మున్సిపల్ కేంద్రానికి చెందిన ప్రముఖ వడ్డీ వ్యాపారి కొడిదల ఉప్పలయ్య గురువారం నాడు మోత్కూరు రోడ్డు సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ సంఘటనకు సంబంధించి తెలిసిన వివరాలు ప్రకారం గత కొన్ని రోజుల కుటుంబంలో జరుగుతున్న అంతర్గత కలహాలతోనే మనస్తాపం చెంది ఉరివేసుకొని మృతి చెందినట్లు తెలుస్తోంది.ఉప్పలయ్య గత 40 సంవత్సరాలుగా తిరుమలగిరిలో పట్టణంలో చిరు వ్యాపారులకు డైలీ ఫైనాన్స్ యిస్తూ వ్యాపారం సాగిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎందరో వ్యాపారులకు వడ్డీ వ్యాపారంతో చేయూతనిచ్చాడు.ఇతని మృతితో పలువురు తోపుడు బండ్ల వ్యాపారస్తులు సంతాపం తెలిపారు.కాగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక ఎస్సై సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక పంచానామా నిర్వహించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034