అజింపేట గ్రామానికి చెందిన వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి

Apr 6, 2024 - 20:01
 0  256
అజింపేట గ్రామానికి చెందిన వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి

అడ్డగూడూరు 06 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని ఆజింపేట గ్రామానికి చెందిన మారోజు శ్రీనివాసచారి తండ్రి అంజయ్య సుమారు వయసు 35 సంవత్సరాలు పనుల నిమిత్తం ఘట్కేసర్ నుండి శుక్రవారం రాత్రి 11 గంటలకు పాటిమట్ల ఎక్స్ రోడ్ లో దిగి తన గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుండగా డి పి ఆర్ వెంచర్ దగ్గరలో  సుమారు రాత్రి సమయం  11గం"లకు గుర్తు తెలియని వాహనం డికొని తలకు బలమైన గాయం కావడంతో సమాచారం తెలుసుకున్న అడ్డగూడూరు పోలీసులు ఆ వ్యక్తిని108 అంబులెన్స్ లో భువనగిరి ఏరియా దవఖానకి తరలించడంతో డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారని ఒక ప్రకటనలో ఎస్ఐ నాగరాజు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333