హైదరాబాద్‌: నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పంజా కొనసాగుతోంది

Aug 31, 2024 - 20:27
 0  2
హైదరాబాద్‌: నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పంజా కొనసాగుతోంది

ఇప్పటికే పలు చోట్ల కూల్చివేతలు చేపట్టారు. శనివారం హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పటాన్‌చెరులో సుడిగాలి పర్యటన చేపట్టారు. స్థానిక సాకి చెరువును పరిశీలించారు. ఇక్కడ కబ్జాకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి.. అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే చెరువులో 18 అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చెరువు వద్ద తూములు బంద్‌ చేసి ఇన్‌కోర్‌ సంస్థ అపార్టుమెంట్‌ కట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అపార్టుమెంట్‌ను రంగనాథ్‌ పరిశీలించారు.

జగన్‌కు నోటీసులు అవాస్తవం

వైకాపా అధ్యక్షుడు జగన్‌కు నోటీసుల ప్రచారంపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ స్పందించారు. సోషల్‌మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333