స్వచ్ఛ ధనం పచ్చదనం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న
స్పెషల్ ఆఫీసర్, గ్రామ సెక్రెటరీ
05-08-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం. చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు5 -9 వరకు తలపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గూడెం గ్రామపంచాయతీ నందు స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమం గురించి ప్రజలకు ప్రోగ్రాం స్పెషల్ఆఫీసర్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ సురేష్ కుమార్ రెడ్డి అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగినది.
ర్యాలీ అనంతరం రామాలయం చుట్టూ శ్రమదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పంచాయతీ కార్యదర్శి ,ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫీసర్, స్కూల్ ఉపాధ్యాయులు ,విద్యార్థులు, అంగన్వాడీ టీచర్ ,ఆశా కార్యకర్తలు, మల్టీపర్పస్ వర్కర్స్, వివో ఏ ,మహిళా సంఘం సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగినది.