విద్యాసంస్థలను తరచూ పర్యవేక్షించాలి: కలెక్టర్
జోగులాంబ గద్వాల 7 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల: జిల్లాలోని గురుకులాలు, వసతి గృహాలు, పాఠశాలలను ప్రత్యేక అధికారులు తరచూ సందర్శిస్తూ విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా పర్యవేక్షించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ శాఖలు ప్రైవేట్ ఇంటర్నెట్కు బదులుగా టీ-ఫైబర్ సేవలను వినియోగించాలని, సెన్సస్ హ్యాండ్బుక్ కోసం గ్రామాల వారీగా సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. వినాయక చవితి, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సూచించారు.