రెండు కుటుంబాలని కుదిపేసిన రోడ్డు ప్రమాదాలు

Jun 22, 2026 - 19:27
 0  0
రెండు కుటుంబాలని కుదిపేసిన రోడ్డు ప్రమాదాలు

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో రెండు యువజంటల దుర్మరణం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో భార్య సంధ్య(22), పెద్ద కొడుకు రుత్విక్(7), మోక్షిత్(2)లతో కలిసి నివాసం ఉంటున్న సాయిప్రకాశ్(25) అనే వ్యక్తి  ఇటీవల తండ్రి మరణించగా, తల్లి జ్యోతి, భార్య సంధ్య, చిన్న కొడుకు మోక్షిత్‌లతో కలిసి హైదరాబాద్ నుండి ములకలపల్లిలోని బంధువుల ఇంటికి నిద్ర చేసేందుకు  వెళ్ళిన సాయిప్రకాశ్ బంధువుల ఇంటి నుండి తిరిగి వస్తుండగా, అదుపుతప్పి మాధారం అటవీ ప్రాంతంలో చెట్టును ఢీకొని సాయిప్రకాశ్, సంధ్య, మోక్షిత్ అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి జ్యోతి

మరోవైపు 8 నెలలు క్రితం ప్రేమ వివాహం చేసుకుని సిద్దిపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మరో యువజంట హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ముంబైకి చెందిన దీక్షిత(25) అనే యువతిని ఎనిమిది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మహేందర్(28) అనే యువకుడు భార్యతో కలిసి హైదరాబాద్ నుండి బండిపై స్వగ్రామానికి వెళ్తుండగా సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం లకుడారం వద్ద ముందు వెళ్తూ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసిన ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టిన మహేందర్  ట్రాక్టర్ వెనుక భాగంలో ఉన్న కేజ్ వీల్స్ తగిలి మహేందర్ అక్కడికక్కడే మృతిచెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన దీక్షిత

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333