వార్డులలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తా

మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి

Oct 6, 2024 - 19:47
 0  1
వార్డులలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తా

సూర్యాపేట 48 వార్డులలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని మాజీ మంత్రి సూర్యాపేట జిల్లా నియోజకవర్గ ఇన్చార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం వార్డు ఇన్చార్జుల  ముఖ్య నాయకుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు 6 గ్యారెంటీల కు డిజిటల్ కార్డు ఉపయోగపడుతుందని అన్నారు. ప్రజల సమస్యల నుంచి పుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. గృహ జ్యోతి కోసం వెళ్ళిన మహిళల్ని అధికారులు ఇబ్బంది పెడుతున్నారని స్పౌట్ ఆఫీస్ కి వెళ్తే కరెంట్ ఆఫీస్ కి వెళ్ళమని కరెంట్ ఆఫీస్ కి వెళ్తే మున్సిపాలిటీ వెళ్ళమని ఇబ్బంది పెడుతున్నారని అలాంటి సమస్యకు పరిష్కారం చూపుతామని అన్నారు. ఇంకా సూర్యాపేటలో గులాబీ వాసన పోలేదని గులాబీ వాసన ను తొలగించి మల్లెపూల వాసనను తీసుకొని రావాలని కోరారు. వార్డు లలో గత ప్రభుత్వం వలన అవకతవకం జరిగాయని కానీ మన ప్రభుత్వంలో అలాంటివి జరగవని అన్నారు. త్వరలో వారానికి మూడు రోజులు ఉదయం రెండు వార్డు లు సాయంత్రం రెండు వార్డు లు తిరుగుతూ ప్రతి సమస్యకు అక్కడనే పరిష్కారం కు చూపుతామని అలాగే వార్డులలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాజకీయ పార్టీ సమస్యలు ఉన్న, వ్యక్తిగత సమస్యలు ఉన్న నా దగ్గరికి రావచ్చని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వాళ్లను పార్టీ ఎప్పుడూ వాళ్లకు అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో  ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి, వార్డు కౌన్సిలర్లు, వాటి ఇన్చార్జిలు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333