వడ్లు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
తిరుమలగిరి 12 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
సూర్యపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ లో ఎఫ్ పి వో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఆ కొనుగోలు కేంద్రానికి ట్యాగింగ్ చేసిన మిల్లు వివరాలు ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత ముందు పంపించాలని ఇదివరకే చెప్పడం జరిగిందని, ధాన్యం తడిచినప్పటికి ఇబ్బంది లేకుంటే మిల్లులకు పంపించాలని , పౌరసరఫరాల అధికారులు మిల్లర్లతో మాట్లాడి ధాన్యం తీసుకునే విధంగా చర్చించాలన్నారు. అనంతరం ఇదే మండలం కోక్యానాయక్ తాండ లో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం డ్రైయర్ ను పరిశీలించారు. అంతేకాక రైతులతో మాట్లాడుతూ ఎంత దాన్యం తీసుకువచ్చారని? తేమశాతం ఎంత ఉందని? అడిగారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో నిర్వహిస్తున్న వివిధ రకాల రిజిస్టర్ లను పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని కుప్పలు వచ్చాయని? సీరియల్ నెంబర్ ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తున్నది ?లేనిది? తనిఖీ చేశారు. 57 మంది రైతులు దాన్యం తీసుకు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. కొనుగోలు కేంద్రానికి నియమించిన ఏఓ ,ఏఈఓ వివరాలను అడగడమే కాకుండా వారితో మాట్లాడారు. ధాన్యం తేమశాతాన్ని పరిశీలించి లారీలు, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. అంతేకాక ట్రక్ సీట్ వివరాలను అడిగారు. కేంద్రం ద్వారా ఇప్పటివరకు చేసిన చెల్లింపులు, తదితర వివరాలన్నింటిని తెలుసుకున్నారు కొనుగోలు కేంద్రానికి సరైన తేమ శాతం తో ధాన్యం వచ్చినట్లయితే జాప్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని ఆదేశించారు జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్ బాబు ,పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాము, తహసిల్దార్ హరిప్రసాద్, ఏ పీ ఎం లక్ష్మి సీసీ నాగయ్య లక్ష్మి తదితరులు ఉన్నారు.