తుంగభద్ర నుంచి జిల్లాకు 1.5 టీఎంసీల తాగునీటి విడుదల
జిల్లాలో నెలకొన్న తాగునీటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని జూలై 16 గురువారము ఉదయం 9 గంటలకు తుంగభద్ర డ్యాం నుంచి రోజుకు 900 క్యూసెక్కుల చొప్పున మొత్తం 1.5 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి తెలిపారు. ఈ నీరు జిల్లాకు చేరుకోవడానికి సుమారు వారం రోజులు పట్టే అవకాశం ఉందన్నారు.విడుదల చేస్తున్న నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిందిగా కలెక్టర్ స్పష్టం చేశారు. పంటల సాగు లేదా ఇతర అవసరాలకు నీటిని వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నీటి సరఫరా మార్గాల వెంట జలవనరుల, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టి అక్రమ వినియోగాన్ని అరికట్టాలని ఆదేశించారు.