రేపు మిషన్‌ భగీరథ బంద్‌

Aug 30, 2024 - 19:54
Aug 30, 2024 - 20:32
 0  13
రేపు మిషన్‌ భగీరథ బంద్‌

జోగులాంబ గద్వాల 30 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల్:  జిల్లాలో రేపు మిషన్‌ భగీరథ తాగునీటి సరఫరా బంద్‌ అవుతున్నట్లు జిల్లా ఇంజనీర్ రవిచంద్ర కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. జిల్లాలోని ధరూర్ మండలం రేవులపల్లి  వద్ద ఉన్న నీటి శుద్ధి కర్మాగారం శుభ్రపరుస్తున్నాం అని తెలిపారు.ఈ కారణంగా శనివారం(రేపు) జిల్లా లో మిషనర్‌ భగీరథ తాగునీటి సరఫరా జరగదని స్పష్టం చేశారు. తిరిగి సెప్టెంబర్ 1వ తేదీన యధావిధిగా మిషన్ భగీరథ నీరు విడుదల చేస్తామని తెలియజేశారు. ప్రజలందరూ సహకరించాలని అయన కోరారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State