మొబైల్ ఫోన్ పోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు:జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు
సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసిన 57 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజే.
గద్వాల . మొబైల్ ఫోన్ పోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ సీఈఐఆర్ వెబ్ పోర్టల్ లో కానీ ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు ప్రజలకు సూచించారు.గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని గ్రెవెన్స్ హల్ నందు జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో పరిధిలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న 57 మంది బాధితుల మొబైల్ ఫోన్లను ఆయా స్టేషన్ లలో సీఈఐఆర్ పోర్టల్ విధులు నిర్వహించే సిబ్బంది ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ చేతుల మీదుగా బాధితులకు అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మొబైల్ దొంగలించబడిన,పోగొట్టుకున్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అలాగే జాగ్రత్తగా ఉంచుకోవడం లో నిర్లక్ష్యము చేయకూడని వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా సీఈఐఆర్ పోర్టల్ లో పిర్యాదు చెయ్యాలని అన్నారు.మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని నేరస్తులు దొంగలించిన మొబైల్ ఫోన్లను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉంటూ వెంటనే సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. మొత్తం 57 ఫోన్ లను నూతన టెక్నాలజీ ఐటి కోర్ నుండి ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగిందనీ , అందుకు కృషి చేసిన ఐటి కోర్ ఎస్సై రజిత , అన్ని పోలీస్ స్టేషన్ లలో సీఈఐఆర్ పోర్టల్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అధికారులను ఎస్పీ అభినందించారు.ఈ సందర్బంగా మొబైల్స్ అందుకున్న బాధితులు జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ సెల్ ఇంచార్జి ఎస్సై రజిత, పోలీస్ స్టేషన్ లలో సీఈఐఆర్ పోర్టల్ విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, మొబైల్స్ పోగొట్టుకున్న బాధితులు తదితరులు పాల్గొన్నారు.