మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన

- జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ...
జోగులాంబ గద్వాల 28 జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని బల్గేర గ్రామానికి చెందిన ముకేరన్న స్కూల్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన మృతదేహాన్ని జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించి మృతి దేహాన్ని జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు...
వీరి వెంట రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బల్గేర నారాయణ రెడ్డి, కృష్ణారెడ్డి, పెద్దపల్లి అల్వాల రాజశేఖర్ రెడ్డి, భాస్కర్ యాదవ్,డిటిడిసి నర్సింహులు,దౌదర్ పల్లి గోపాల్ వర్మ, ఇలియాస్,ఇమ్మనేయిల్ తదితరులు ఉన్నారు.