మీసేవ ఆపరేటర్లు ప్రభుత్వ నిర్ణయించిన ధర మాత్రమే వసూలు చేయాలి....... తాసిల్దార్ ఆంజనేయులు

Jul 11, 2024 - 16:15
Jul 11, 2024 - 20:16
 0  6
మీసేవ ఆపరేటర్లు ప్రభుత్వ నిర్ణయించిన ధర మాత్రమే వసూలు చేయాలి....... తాసిల్దార్ ఆంజనేయులు
మీసేవ ఆపరేటర్ల సమావేశంలో మాట్లాడుతున్న తహసిల్దార్ ఆంజనేయులు

మునగాల 11 జూలై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- మునగాల తాసిల్దార్ కార్యాలయంలో మీసేవ ఆపరేటర్ల సమావేశం తాసిల్దార్ ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీసేవ ఆపరేటర్లు ప్రభుత్వం నిర్ణయించిన ధరలు మాత్రమే వసూలు చేయాలన్నారు, అంతకంటే ఎక్కువ వసూళ్లు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సదరం సర్టిఫికెట్ల కోసం ట్రై చేసుకున్న వికలాంగుల నుంచి అధికంగా వసూళ్లు చేయవద్దని హెచ్చరించారు. మీసేవ ఆపరేటర్లకు బయట వ్యక్తుల నుంచి ఎలాంటి ఇబ్బంది కలిగిన తమకు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. ఈ సందర్భంగా మీసేవ బాండ్ పేపర్లు మీసేవ సెంటర్ లోనే కాకుండా ఇతర ఇంటర్నెట్, సిఎస్సి సెంటర్లో కూడా ఉన్నాయని మునగాల సామాజిక కార్యకర్త గంధం సైదులు తాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. వీటి మీద తనిఖీలు చేయాలని కోరారు. స్పందించిన ఆయన త్వరలోనే సెంటర్ పైన తనిఖీలు చేస్తామన్నారు. అనంతరం మీ సేవ ఆపరేటర్లకు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మరియు నిర్వహణ విషయంలో పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ సత్యనారాయణ, ఆర్ ఐ రామారావు తదితరులు పాల్గొన్నారు

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State