బిజెపిలో స్వచ్ఛందంగా చేరికలు
జోగులాంబ గద్వాల23 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- అయిజ. మున్సిపాలిటీ పరిధిలో ఇబ్రహీం ఆధ్వర్యంలో 17 వ వార్డ్ నరసింహ కాలనీవాసులు బీజేపీ పార్టీలో జిల్లా అధ్యక్షుని సమక్షంలో చేరడం జరిగింది. వారిని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు S. రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... జిల్లాలో పలువురు యువత, మైనార్టీలు, కార్మికులు, కర్షకులు, మేధావులు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ . సుభిక్ష, సురక్ష, అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారని భారతదేశాన్ని విశ్వ గురు స్థానానికి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధానిని చూసి మనమంతా గర్వపడాలని వారు వచ్చిన తర్వాత స్థానిక సంస్థలు బలపేతమయ్యాయి, రాబోయే రోజుల్లో జిల్లాలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని వారన్నారు
పార్టీ చేరిన వారిలో పులికల్ భీమన్న , ఓబుల్ రెడ్డి, మేఘనాథ్ గౌడ్ , డిష్ భాష, రజియా వీరితోపాటు 50 మంది కాలనీవాసులు చేయడం జరిగింది .
ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు, ఐజా టౌన్ కన్వీనర్ ప్రదీప్ స్వామి, OBC మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ యాదవ్ పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, OBC మోర్చా పట్టణ అధ్యక్షులు బోయ వెంకటేష్ భూత అధ్యక్షులు రాజశేఖర్, గడిగే రఘు, తెలుగు నరసింహులు, తదితరులు పాల్గొన్నారు...