ఫోటో ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి పొంగులేటి

Aug 19, 2024 - 20:05
Aug 19, 2024 - 21:06
 0  16
ఫోటో ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి పొంగులేటి

తెలంగాణవార్త 19-08-2024 సూర్యాపేట జిల్లా ప్రతినిధి:- ఇవ్వాళ అంతర్ జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని బషీర్ బాగ్ లోని దేశోద్దారక భవన్ లో తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఫోటోల ప్రదర్శనను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఫోటోలను ఆయన తిలకించి ఫోటో జర్నలిస్టులను అభినందించారు. మంత్రితో పాటు ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి, ఐజేయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుండగా తొలిసారిగా తమ యూనియన్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కే.రాంనారాయణలు ఘనంగా స్వాగతం పలికారు. యూనియన్ కార్యాలయంలోని ఆడిటోరియంలను, అనుబంధ సంస్థల కార్యాలయాలను మంత్రి తిలకించి ఆనందం వ్యక్తం చేశారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223