ప్రజలు భయాందోళనకు గురి కావొద్దు

Sep 27, 2024 - 19:06
 0  84
ప్రజలు భయాందోళనకు గురి కావొద్దు

హైడ్రాకు ఆక్రమణదారులు, బడా బాబులు భయపడాలి సామాన్య ప్రజలు కాదు

ప్రజా ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను తొలగిస్తుంది కొత్త ఇబ్బందులు తీసుకురాదు 

హైడ్రా పట్ల ఎలాంటి భయాందోళనలు అవసరం లేదు ప్రజలు ధైర్యంగా ఉండాలి

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్

తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని ప్రజల ఇబ్బందులు తొలగిస్తుంది తప్ప కొత్త ఇబ్బందులు తీసుకురాదని హైడ్రా పట్ల ప్రజలు ధైర్యంగా ఉండాలని వదంతులు నమ్మవద్దని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్డిఎల్, బఫర్ జోన్లలో ఉన్న భూములను కాపాడి చెరువు విస్తీర్ణాన్ని పెంచేందుకు తీసుకువచ్చిన హైడ్రా బడా బాబులు, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుందన్నారు. హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో కూల్చి వేసిన భవనాలు అక్రమ కట్టడాలు అన్ని ఎఫ్డిఎల్,  బఫర్ జోన్ల పరిధిలో ఉన్నవే అన్నారు. చెరువు భూములను ఆక్రమించుకొని నివాసాలు ఏర్పాటు చేసుకున్న అక్రమార్కులు భయపడాలి తప్ప సామాన్య ప్రజలకు హైడ్రా ఏలాంటి హాని తలపెట్టదన్నారు. కొందరు అక్రమార్కులు ప్రజలతో చేరి లేని పోనివి చెప్పి వారిని ఆందోళనకు గురి చేస్తున్నారని ప్రజలు వదంతులు నమ్మవద్దన్నారు. 

పేద మధ్యతరగతి ప్రజలు అప్పులు చేసి బ్యాంకు రుణాలు తీసుకొని ప్లాట్లు కొనుగోలు చేసి కట్టుకున్న విషయం ప్రభుత్వానికి తెలుసని ప్రభుత్వం వారిని రోడ్డున పడేసే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయదని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333