పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది.....

May 26, 2024 - 17:07
May 26, 2024 - 19:28
 0  5
పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది.....

ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు : ఆర్డీవో సూర్యనారాయణ 

మునగాల 26 మే 2024  తెలంగాణవార్త ప్రతినిధి :-  ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పగడ్బందీ ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో సూర్యనారాయణ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 484, 485 పోలింగ్ బుతులకు ఈవీఎంలు చేరుకున్న సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సమస్యాత్మక గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఆంజనేయులు, షరీఫ్, వెంకటేశ్వర్లు, పోలింగ్ సిబ్బంది,బి ఎల్ ఒ లు తదితరులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State