పోగొట్టుకున్న ఫోన్ అప్పగింత:ఎస్సై చంద్ర కాంత్

Feb 29, 2024 - 18:31
 0  9
పోగొట్టుకున్న ఫోన్ అప్పగింత:ఎస్సై చంద్ర కాంత్

జోగులాంబ గద్వాల 29 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మానవపాడు. మండల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫోన్లను పోగొట్టుకున్న వ్యక్తులు ఫోన్ ఎక్కడో పడిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సీఈఐఆర్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి ఫోన్‌లను  గుర్తించి గురువారం బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై  చంద్రకాంత్ మాట్లాడుతూ... ఎవరైనా వారి ఫోన్ పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా అట్టి ఫోన్ వివరాలను సీఈఐఆర్‌లో నమోదు చేయాలన్నారు.దీని ద్వారా ఫోన్‌ను పొందే అవకాశం ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎవరికైనా మొబైల్ ఫోన్‌లు, అనుమానిత వస్తువులు, ఇతర విలువైన వస్తువులు దొరికితే సమీప పోలీష్‌స్టేసన్‌లో అప్పగించాలన్నారు. అంతే కాని అలాంటి వస్తువులను తమ దగ్గర ఉంచడం వల్ల నేరం అని ఎస్సై తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333