పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత

Aug 3, 2024 - 20:56
 0  3
పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత

జోగులాంబ గద్వాల: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ ఆదేశాలతో సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి అరిఫుద్ధిన్ ఆధ్వర్యంలో గట్టు ఎంపీడీవో, ఎస్సైలను కలిసిన అనంతరం మండల పరిధిలోని బోయలగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర కళాకారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, బాల కార్మిక నిర్మూలన, బాల్యవివాహాలు, వెట్టి చాకిరి నిర్మూలన, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ఆట,పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటుందని వారు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కేశవులు, ప్రసాద్, రమాదేవి, స్వామి, భూపతి, రాహుల్, కృష్ణ, హజ్రత్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333