నారాయణ పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ వార్షికోత్సవ వేడుకలు..

Apr 24, 2024 - 21:40
 0  18
నారాయణ పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ వార్షికోత్సవ వేడుకలు..

తెలంగాణవార్త 24 ఏప్రిల్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి :- ప్రతి ఒక్కరు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకురావాలని నిజామాబాద్ బ్రాంచ్ ఎంజీఎం శివాజీ పాటీల్ అన్నారు.నిజామాబాద్ సుభాష్ నగర్ బ్రాంచ్ నారాయణ గ్రూప్ ఆఫ్ లో బుధవారం గ్రాడ్యుయేషన్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంజీఎం.శివాజీ పాటిల్, ప్రిన్సిపల్ జోష్ణ, జోనల్ కోఆర్డినేటర్ అజీమా పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థి,విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్, మెమోన్టోలను అందజేశారు. విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన డ్యాన్సులు,నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి.ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు,తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333