దేశ భవిష్యత్తు ఓటర్ల చేతుల్లో ఉన్నది:జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

Jan 25, 2025 - 19:48
 0  6
దేశ భవిష్యత్తు ఓటర్ల చేతుల్లో ఉన్నది:జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

ఓటర్ల అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జోగులాంబ గద్వాల 25 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: దేశ భవిష్యత్తు ఓటర్ల చేతుల్లో ఉన్నందని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకొని సక్రమంగా వినియోగించు కోవాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు. శనివారం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కాంప్లెక్స్ నుండి కృష్ణవేణి చౌక్ వరకు నిర్వహించిన ఓటర్ల అవగాహన ర్యాలీకి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో అధికారులు,విద్యార్థులు పాల్గొని ప్లే కార్డులు చేతబట్టి మన ఓటు – మన హక్కు, ఓటు ఈజ్ యువర్ వాయిస్ వంటి నినాదాలతో ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఓటర్ నమోదు చేయించి, ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు అనేది పౌరుడి హక్కు మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తివంతమైన ఆయుధమని అన్నారు. మీ అభిప్రాయం ప్రభుత్వానికి చేరాలంటే, పాలసీ మేకింగ్‌లో మీ వంతు పాత్ర  ఉండాలంటే , ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని పేర్కొన్నారు.నేటి విద్యార్థులే రేపటి పౌరులు, అందుకే వారిలో ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించాడం జరిగింది.  ప్రతి పౌరుడి బాధ్యతలో ప్రధానమైనది ఓటరుగా నమోదు కావడం, ఓటు హక్కును వినియోగించుకోవడమని తెలిపారు.ఓటు వేయడం ద్వారానే మీ వాయిస్ ను ప్రభుత్వానికి చేరవచ్చు,” అని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం 17 ఏళ్లు నిండినవారికి ఓటరుగా నమోదు అయ్యే అవకాశం కల్పించిందని అన్నారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుకోవాలని,ఆన్‌లైన్‌లో కూడా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని, బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికీ వచ్చి ఈ ప్రక్రియను సులభతరం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ప్రదేశంలో ఓటింగ్ అందుబాటులో ఓటు హక్కును అందరికీ చేరువ చేయడానికి ప్రభుత్వం దూర ప్రాంతాలు, దీవులు, లేదా అందుబాటులోకి రానివంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని గుర్తు చేశారు. జిల్లా లోని గుర్రం గడ్డ గ్రామం వంటి దివి ప్రాంతాల్లోకి బోట్ లైన్ల ద్వారా ఓటర్లను చేరుకోవడం కోసం ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం ఇంత కృషి చేస్తున్నా, పట్టణ ప్రాంతాల్లో చాలా మంది ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు,పల్లెల్లో ఓటింగ్ శాతం మంచి స్థాయిలో ఉన్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో  కూడా ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని తమ హక్కును వినియోగించుకోవాలని అన్నారు. మీరు ఎక్కడ ఉన్నా ఎన్నికల సమయంలో కచ్చితంగా ఓటు వేయాలని సూచించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యతగా పేర్కొంటూ, అందరూ ఓటర్లుగా నమోదు చేసుకుని అవగాహన పెంపొందించి, తమ ఓటు హక్కును వినియోగించడం ద్వారా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం కావాలని అన్నారు.ఆ తర్వాత, ర్యాలీలో పాల్గొన్న అందరూ ఓటర్ ప్రమాణం తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ శాఖ మరియు స్వీప్ నోడల్ అధికారి రమేష్ బాబు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సరోజ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333