దండు మైసమ్మ ఆలయ పూజారికి విశ్వ పురోహిత బిరుదు ప్రధానం

May 16, 2024 - 19:56
 0  13
దండు మైసమ్మ ఆలయ పూజారికి విశ్వ పురోహిత బిరుదు ప్రధానం

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ దండు మైసమ్మ ఆలయ పూజారికి విశ్వ పురోహిత రత్న బిరుదు ప్రదానం ఆత్మకూర్ ఎస్.... మండల పరిధిలోని నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయ పూజారి అబ్బోజు సతీష్ చార్యులకు తెలంగాణ విశ్వ కర్మ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వ పురోహిత రత్న బిరుదు ను అందజేశారు. బుధవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన సమావేశంలో ఈ బిరుదును అందజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు వేముల వాడ మదన్ మోహన్ ఆచార్యులు, విశ్వజ్యోతిర్లింగ పీఠాధిపతి రామడుగు నర్సింహ చార్యుల చేతుల మీదుగా ఈ బిరుదు అందజేశారు.