ఘనంగా శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణం.
జోగులాంబ గద్వాల 13 జనవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- మల్దకల్ ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా సోమవారం శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, ఏవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో మధుసూదనచారి ,రవి వేదమంత్రాలతో స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు అనంతరం ప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.