గ్రామస్తుల సహాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు ఎస్సై వెంకట్ రెడ్డి
అడ్డగూడూరు 28 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని బొడ్డుగూడెం గ్రామ ప్రజల(హైవే పక్కన ఇండ్ల వాళ్ల) కోరిక మేరకు నేరాల నివారణకు సిసి కెమెరాలు కావాలని అడగగా పోలీస్ వారి చొరవతో ఆ గ్రామానికి చెందిన కూరాకుల హరిప్రసాద్ సహాయ సహకారాలతో 4 సిసి కెమెరాలను బొడ్డుగూడెం హైవే పై మంగళవారం రోజు అమర్చి గ్రామ ప్రజలకు మేలుకొరకు సహకరించడం జరిగిందని ఎస్ఐ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.