కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మందుల సామెల్

Sep 23, 2024 - 17:59
 0  471
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మందుల సామెల్

తిరుమలగిరి 23 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:

తిరుమలగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్,08 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి పెద్దపీట వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఆసరాగా ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి చెందుతుందని తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనతి కాలంలోనే లక్షలాది మందికి రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు, ఆడపిల్లలు కన్న తల్లిదండ్రులకు ఆర్థిక కష్టాలు తీర్చడానికి ఈ పథకం కొంతమేర ఉపయోగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల  తహసిల్దార్ హరిప్రసాద్ , షేక్ జాన్ మహమ్మద్, మున్సిపల్ చైర్ పర్సన్ శాగంటి అనసూయ రాములు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై. నరేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ దరావత్ జుమ్మిలాల్, పేరాల వీరేష్ , మూల అశోక్ రెడ్డి కందుకూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034